Home » CID
తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కేసుల్లో బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలీసింగ్కు సీఐడీ శ్రీకారం చుట్టింది..
ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన ఏపీకి చెందిన యువతను సీఐడీ పోలీసులు రక్షించారు. భారత దేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్లో పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
ఏపీలోని శ్రేయా ఇన్ఫ్రా కంపెనీలపై ఏపీ సీఐడీ, స్థానిక పోలీసులు చేపట్టిన చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ఈ సంస్థపై వందల కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
పరకామణి కేసులో వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు.
ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ అధికారులు ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవి వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు.
ఇటీవల బెట్టింగ్ యాప్ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులను సీఐడీ సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ.. సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు.
CID Complaint: దల్జీత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్లబ్లు నడుస్తున్నాయి. గతంలో మల్టీపుల్ క్లబ్ ఓనర్షిప్ నిబంధనల ఉల్లంఘనతో 57 క్లబ్బులపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారు.
Uppal Stadium CID Raids: హెచ్సీఏ అక్రమాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు సీఐడీ అధికారులు.