Tirumala: తిరుమలలో జాతీయ భద్రతా సలహాదారు సీడీఎస్
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:29 AM
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి.కామత్ శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న అజిత్ దోవల్, జనరల్ అనిల్ చౌహాన్
తిరుమల/రేణిగుంట, జూన్ 21(ఆంధ్రజ్యోతి): జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి.కామత్ శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న వారికి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో డీఆర్డీవో ఏర్పాటు చేస్తున్న ఆయుధ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పనుల్ని పరిశీలించి తిరిగి 5.30 గంటలకు తిరుపతి విమానాశ్ర యం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్న వారికి టీటీడీ రిసెప్షన్, విజిలెన్స్ అధికారులు స్వాగతం పలికారు. అజిత్ దోవల్, అనిల్ చౌహాన్, సమీర్ వి.కామత్ ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Updated Date - Jun 22 , 2025 | 04:29 AM