జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:52 AM
పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానాలో ఈనెల 21న నిర్వహించే మెగా జాబ్మేళాను సద్వినియో గం చేసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సూచించారు.
నంద్యాల రూరల్, జూలై 18(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానాలో ఈనెల 21న నిర్వహించే మెగా జాబ్మేళాను సద్వినియో గం చేసుకోవాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సూచించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం స్కిల్ డెవలెప్మెంట్ అధికారి శ్రీకాంత్రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి సుబ్బన్న, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ మస్తాన్వలి, 3, 11వార్డుల టీడీపీ ఇన్చార్జిలు మారుతి, అప్జల్తో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిరోజ్ మాట్లాడుతూ ఇందులో 11 కంపెనీ ప్రతినిధులు పాల్గొని 550 మందికి ఉద్యోగ అవకా శాలు కల్పిస్తారని వెల్లడించారు.
Updated Date - Jul 19 , 2025 | 12:52 AM