Home » Nandyal
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాలలో జరిగే భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడం్బందీగా నిర్వహించాలని బనగానపల్లె ఆర్డీవో వై . నరేంద్రనాథ్ రెడ్డి సూచించారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శక్తి టీమ్లను నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.
సంచార, దళిత, పీడిత వర్గాల వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నంద్యాల ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి అన్నారు.
భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.
నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్ద రైలు ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న రైతును రైలు ఢీకొట్టింది.
ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురాగలిగే పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే మహత్తర లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.