Home » Nandyal
నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్ సెల్ఫోన్లో జగన్ పాట పెట్టి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు.
Andhrapradesh: ఈరోజు (గురువారం) కర్నూలు, నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అయితే సీఎం పర్యటనతో బనగానపల్లె జనం హడలెత్తిపోతున్నారు.
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బనగానపల్లెలో రూ.22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరగనున్నాయి.
Andhrapradesh: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది.
నంద్యాల: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆది దంపతులు సాయంత్రం గజ వాహనంలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు.
నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు శబరి రంగంలోకి దిగనున్నారా..? అంటే ఔననే అంటున్నారు ఆమె అనుచరులు. తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందని చెబుతున్నారు. శబరి టికెట్ గురించి కొద్దిరోజుల్లో అధికార ప్రకటన వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బైరెడ్డి శబరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.
Andhrapradesh: ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై డోన్ టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీకు దమ్ముంటే రాజకీయం చేయండి. పోలీసులను అడ్డుపెట్టుకొని డోన్ నియోజకవర్గం వ్యాపారులు, మైనింగ్ పారిశ్రామిక వేత్తలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. జగన్ కంటే నా పైన ఫ్యాక్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయా?. దీనికి బుగ్గన సమాధానం చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు.
నంద్యాల: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు హంస వాహనంపై ఊరేగనున్నారు.
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో పెద్దిరాజు,చైర్మన్ దంపతులు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది.