Share News

Nandyal: దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:51 AM

కన్న బిడ్డలను దారుణంగా చంపేశాడో తండ్రి. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. బిడ్డలను చంపి.. ఆపై ఆయనా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Nandyal: దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై
Nandyal

నంద్యాల, జనవరి 1: కడుపున పుట్టిన పిల్లలను తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తమకు ఎంత కష్టం వచ్చినా కూడా బిడ్డలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. పిల్లల విషయంలో తండ్రి స్థానం ఎంతో గొప్పది. తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని రెక్కలుముక్కలు చేసుకుని కష్టపడుతుంటాడు. అలాంటి తండ్రి.. పిల్లలకు ఒక హీరో అనే చెప్పుకోవాలి. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి మాత్రం పిల్లల విషయంలో ఎంతో కర్కశంగా ప్రవర్తించాడు. తన రెక్కల కింద దాచుకోవాల్సిన చిన్నారులను తనే పొట్టనబెట్టుకున్నాడు. ఆపై అతడూ దారుణానికి పాల్పడ్డాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే...


నంద్యాల జిల్లా తొడుములదిన్నెలో దారుణం జరిగింది. కన్నబిడ్డలను అతి కిరాతకంగా చంపేశాడో తండ్రి. తన ముగ్గురు పిల్లలను కడతేర్చిన తండ్రి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చనిపోయిన ముగ్గురు చిన్నారులు కావ్య(7), ధ్యానేశ్వరి(4), గగన్(2)లుగా గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ముగ్గురు చిన్నారులను తండ్రి ఎందుకు చంపేశాడు? ఇందుకు గల కారణాలు ఏంటి? కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

మందుబాబులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. భారీగా కేసులు

ఇదీ హైదరాబాద్ అంటే.. సీపీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 11:16 AM