ఎన్టీఆర్ జలాశయం పరిశీలన
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:33 AM
నందికొట్కూరులోని ఎన్టీఆర్ జలాశయాన్ని ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ శనివారం పరిశీలించారు.
నందికొట్కూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): నందికొట్కూరులోని ఎన్టీఆర్ జలాశయాన్ని ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ శనివారం పరిశీలించారు. పట్టణంలోని దేవదాయశాఖకు చెందిన భూమిలో 60 సెంట్లు ఎన్టీఆర్ జలాశయానికి నాడు ఇచ్చారని, మిగిలిన 40 సెంట్ల భూమిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు జలాశయాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపించ డంతో ఆర్డీవో పరిశీలించారని ఈవో సాయి తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రికార్డులను పరిశీలించి నివేధికలను కలెక్టర్కు పంపుతామని ఆర్డీవో తెలిపారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ నాయకుల భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి
ఆత్మకూరు: సమాచార హక్కు చట్టంపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, ఆ చట్టంలోని అన్ని అంశా లపై అవగాహన ఉండాలని ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి సూచించారు. పట్టణంలోని సెరికల్చర్ ఆఫీసులో పట్టు పరిశ్రమ శాఖ - సమాచార హక్కు చట్టం - 2005పై శనివారం ప్రముఖ న్యాయవాది శ్రీధర్ అడిగి ద్వారా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారి నగేష్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 12:33 AM