జల్జీవన్ పనుల పరిశీలన
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:43 AM
శ్రీపతిరావుపేట, బాపనంతాపురం, కొత్తరామాపురం గ్రామాల్లో జల్ జీవన్ ద్వారా జరిగిన పనులను ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక అధికారి నేషనల్ వాష్ ఎక్స్పర్ట్ సరోజిత్ సఖియా బుధవారం పరిశీలించారు.
ఆత్మకూరురూరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): శ్రీపతిరావుపేట, బాపనంతాపురం, కొత్తరామాపురం గ్రామాల్లో జల్ జీవన్ ద్వారా జరిగిన పనులను ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక అధికారి నేషనల్ వాష్ ఎక్స్పర్ట్ సరోజిత్ సఖియా బుధవారం పరిశీలించారు. డివిజన్లోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవో సయ్యద్ ఉమ్మర్తో ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకులను, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులను, వ్యక్తిగత మరుగు దొడ్లను పరిశీలించారు. తాగునీటి ట్యాంకుల పరిశుభ్రతను, నాణ్యతను పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈలు ఉమాకాంత్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏఈ పక్కీరయ్య, జిల్లా ఎస్బీఎం విజయ్కుమార్, డిప్యూటీ ఎంపీడీవో బాలునాయక్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ శానిటేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 12:43 AM