రైతులు హోల్సేల్ వ్యాపారంపై దృష్టి పెట్టాలి
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:45 AM
రైతులు పంటలు ఉత్పత్తి చేయడమే కాకుండా హోల్సేల్ వ్యాపారం దిశగా అడుగులు వేయాలని నాబార్డు ఏజీఎం కార్తీక్ సూచించారు.
జూపాడుబంగ్లా, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రైతులు పంటలు ఉత్పత్తి చేయడమే కాకుండా హోల్సేల్ వ్యాపారం దిశగా అడుగులు వేయాలని నాబార్డు ఏజీఎం కార్తీక్ సూచించారు. మండలంలోని తాటిపాడు గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల కేంద్రాని తనిఖీ చేశారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ వస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేసీ కాలువ సాగునీటి సంఘం అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మన్నగౌడు, ఏఈవో నాగేశ్వరరావు, ఎంపీఈవో మధు, రైతులు ఆదినారాయణరెడ్డి, వెంకట రంగారెడ్డి, మన్సూర్బాషా, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:45 AM