పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN, Publish Date - May 12 , 2025 | 12:01 AM
మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో 1996-2000 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
గురువులతో పూర్వ విద్యార్థులు
గడివేముల, మే 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో 1996-2000 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తరువాత ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి జ్ఞాపికలను అందజేశారు. పాఠశాలకు ఫర్నిచర్ను అందజేశారు. పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఫోటోలు దిగి మధుర స్ర్ముతులను నెమరువేసుకున్నారు.
Updated Date - May 12 , 2025 | 12:01 AM