ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jenasena: థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

ABN, Publish Date - May 27 , 2025 | 03:26 PM

Jenasena: థియేటర్ల బంద్‌కు సంబంధించి జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్‌ వెనక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Jenasena

అమరావతి, మే 27: థియేటర్ల బంద్ (Theaters Bandh) వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ (Janasena Party) కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను (Rajahmundry in charge Atti Satyanarayana) తొలగించింది. థియేటర్ బంద్ వెనక సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజానిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది.


జూన్ 1న సినిమా థియేటర్ల బంద్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ (Harihara Veeramallu Movie) రిలీజ్ నేపథ్యంలో కుట్ర పూరితంగానే ఈ వ్యవహారం నడుస్తోందని ఇప్పటికే నిర్ధారించారు. ఇందులో తమ పాత్ర లేదని నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ చెప్పినప్పటికీ ప్రభుత్వపరంగా పార్టీపరంగా జరిపిన విచారణలో కొంతమంది నేతల పేర్లు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా జనసేన పార్టీకి చెందిన రాజమండ్రి నేత అత్తి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. థియేటర్ల బంద్‌కు సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టగా.. ఈ వ్యవహారంలో సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రారంభమైందని, అక్కడి నుంచే తెలంగాణకు ఆపాదించారంటూ దిల్‌ రాజు కూడా చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో వెంటనే అప్రమత్తమైన జనసేన అధిష్టానం దీనిపై విచారణ జరిపి సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు తేల్చారు.


ఈ నేపథ్యంలో సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ జనసేన అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన నేత వేముల అజయ్ కుమార్ పేరుతో సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. ‘ థియేటర్ల బంద్ వ్యవహారంలో మీ పాత్ర ఉన్నట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అందువల్ల మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో మీ ప్రమేయం లేదని నిర్ధారించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటాం’ అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో సత్యనారాయణతో పాటు ఇంకెవరెవరి పాత్ర ఉంది అనేదానిపై ఆరా తీయనున్నారు. కాసేపటి క్రితమే ఈ వ్యవహారంలో జనసేన పార్టీ నేతలు ఉన్నా చర్యలు తప్పవంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించిన గంటలోనే అత్తి సత్యనారాయణ తొలగింపు ప్రకటన బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

థియేటర్ల బంద్ ఎవరి పని.. విచారణ చేయాల్సిందే.. పవన్ ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 03:54 PM