ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: అప్రమత్తంగా ఉండండి.. జనసైనికులకు పవన్‌ కీలక సందేశం

ABN, Publish Date - Jan 26 , 2025 | 10:15 PM

Pawan Kalyan: జనసేన నేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున కూడా స్పందించవద్దని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Pawan Kalyan

అమరావతి: జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదని అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారని మండిపడ్డారు. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చడంపై ప్రజలు విసుగు చెందారని చెప్పారు. సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రజలు నడుం బిగించారని అన్నారు. అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కల్యాణ్ అన్నారు.


బాధ్యతగా ఉండాలి..

కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం విజయంతో 154/175 స్థానాలను ఎన్డీఏ కూటమికి, వందశాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నామని చెప్పారు. దానంతటికి కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే ఇందుకు కారణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.


పదవుల కోసం రాజకీయం చేయలేదు..

సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దని ఆదేశించారు. ఎంతో బాధ్యతగా ఐదుకోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని అన్నారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటమేనని చెప్పారు. తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమేనని అన్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి జెన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేశారు. మార్చ్ 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 26 , 2025 | 10:22 PM