Home » JanaSena Party
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్కు తెలంగాణ జనసేన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించింది. విద్యార్థుల నిజమైన ఆందోళనలు.. అశాంతిని సృష్టించాలనుకునే శక్తులకు వేదికకాకూడదని వెల్లడించింది.
ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
విజయవాడలో జనసేన పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజల అనంతరం తెలంగాణ తల్లికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.
హైదరాబాద్లో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత’ సమావేశం ఢిల్లీలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం ఐదు కీలక తీర్మానాలని ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.
జనసేన హౌస్మోషన్ పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది.
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డులు, డివిజన్ల పునర్విభజన అంశంపై కీలక సమావేశం నిర్వహించింది.