Home » JanaSena Party
హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజల అనంతరం తెలంగాణ తల్లికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.
హైదరాబాద్లో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు మల్కం చెరువు సమీపంలోని పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత’ సమావేశం ఢిల్లీలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం ఐదు కీలక తీర్మానాలని ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.
జనసేన హౌస్మోషన్ పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది.
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డులు, డివిజన్ల పునర్విభజన అంశంపై కీలక సమావేశం నిర్వహించింది.
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యచంద్రులని జనసేన పార్టీ నేత, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అభివర్ణించారు.
మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.