ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: రాష్ట్ర ఆదాయం పెంచండి

ABN, Publish Date - May 14 , 2025 | 03:49 AM

రాష్ట్ర ఆదాయం పెంచేందుకు విభిన్న శాఖలపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు, డేటా ఆధారంగా ప్రణాళికలు రూపొందించి శాఖల పనితీరును మెరుగుపర్చాలని సూచించారు. కొత్త ఎక్సైజ్‌ పాలసీ, ఎర్రచందనం విక్రయం, ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థలతో ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్జన అవకాశాలపై అధ్యయనం చేయండి

సొంత ఆదాయం పెంచుకునేందుకు

ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, సేవల రంగాలు దోహదం

బంగారం కొనుగోళ్లలో పన్ను ఎగవేతలున్నాయి

ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ ఏర్పాటు చేయాలి

ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు

ఈఏడాది 1.34 లక్షల కోట్ల ఆర్జన లక్ష్యం

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గడిచిన 30 ఏళ్లలో వచ్చిన ఆదాయ ధోరణులు పరిశీలించి భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ర్టానిక్స్‌, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖల వారీ పురోగతిపై చర్చించారు. ఏడాది కాలంలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. కేంద్ర సాయం, అప్పులు అనేది ప్రాథమిక దశలో నిలబడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని, మంచి పనితీరు ద్వారా శాఖల్లో ఆదాయం పెరిగే ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్‌ ఏర్పాటు చేయాలని, ప్రతిశాఖకు ఏఐ బృందం ఉండాలని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్‌ ద్వారా సేవలు అందించేలా వచ్చే 2, 3 నెలల్లో ఏఐ ఆధారిత పన్ను ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.


మద్యం సరఫరా, అమ్మకాల ట్రాకింగ్‌

పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా నుంచి అమ్మకం వరకు రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేయాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడులో రవాణా ఆదాయం పెరుగుతుంటే ఏపీలో ఎందుకు తక్కువగా వస్తోందని ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి సరైన విధానాలు అవలంబించాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయి లో ఎందుకు లేదో పరిశీలించాలని చెప్పారు, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌, గనులు, అటవీ ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 2025-26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ. 1,34,208 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గత ఏడాది కంటే 29శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1నుంచి మే 11వరకు వాణిజ్య పన్నులు, అటవీ ఆదాయంలో తగ్గుదల కనిపించగా, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ అనూహ్యంగా ఆదాయం పెరిగింది. 2024-25లో ఇదే కాలానికి కేంద్రం నుంచి రూ. 17,170 కోట్లు రాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,717 కోట్లు మాత్రమే (26ు తక్కువ) వచ్చిందని సీఎంకు అధికారులు వివరించారు.


కొత్త ఎక్సైజ్‌ పాలసీతో ఆదాయం పెరుగుదల

రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన ఎక్సైజ్‌ పాలసీతో ఆదాయం పెరిగింది. 2024-25లో రాష్ట్రానికి ఎక్సైజ్‌ ఆదాయం రూ. 28,842 కోట్లు వచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 14.84 శాతం ఎక్కువ. అయితే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్‌ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో రాష్ట్రానికి రూ.2,116 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్‌ ద్వారా రూ. 33,882 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు వివరించారు.

ఎర్రచందనం నిల్వలపై సమగ్ర అధ్యయనం

రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాలయ విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని దీనిని విక్రయించడం ద్వారా పెద్దఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. రాష్ట్రంలో ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి, వాటి విలువ ఎంతనే దానిపై కమిటీ వేసి స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్‌ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని, ప్రస్తుతం అలాంటి అవకాశం ఏపీకి లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని సీఎం అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 03:49 AM