Water Resources: పోలవరం బనకచర్ల ప్రయోజనాలేంటో చెప్పండి
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:05 AM
పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్ పథకంపై కేంద్రం ఆర్థిక శాఖకు సవివర వివరాలు కోరింది. రూ.81,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రైతులకు, తాగునీటి సరఫరాకు ఎంతగానో సహాయపడుతుందన్న దిశగా రాష్ట్ర అధికారులు కేంద్రానికి వివరాలు అందించనున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్రం పిలుపు.. రేపు ఢిల్లీలో ప్రత్యేక సమావేశం
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మానసపుత్రిక పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్ పథకంపై కేంద్రం మేధోమథనానికి సిద్ధమైంది. పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్ ప్రాజెక్టు కింద గోదావరి జలాల అనుసంధాన పథకంపై సవివరమైన సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. రూ.81,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? రైతులకు, తాగునీటికి ఎలా ఉపయోగపడుతుందో వివరించాలని సూచించింది. దీంతో ఆదివారం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూ ష్ కుమార్, జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు చీఫ్ సెక్రటరీ నరసింహమూర్తి తదితరులు ఢిల్లీకి వెళుతున్నారు. భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ఆర్జిత ప్రాజెక్టుగా ఉంటుందని సోమవారం కేంద్రానికి వివరించనున్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్లో కరోనా.. ఐసోలేషన్కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:05 AM