Loan Scam: బ్యాంకు ఉద్యోగికి ట్రాప్
ABN, Publish Date - May 27 , 2025 | 06:04 AM
బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్పై రుణం పొందేందుకు పిలిచి అమానుష దాడి జరగగా, అప్పటి నుంచి నగదు వసూలు చేసి బెదిరింపు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఏడుగురు అరెస్ట్ అయి రూ.5.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
లోను అర్జీ పెట్టి.. ఇంటికి పిలిచి నిర్బంఽధం
దుస్తులు తీయించి దాడి.. వీడియోలు చిత్రీకరణ
వాటిని తొలగిస్తామని రూ.6.50 లక్షలు వసూలు
నేరగాళ్లకు సహకరించిన మరో బ్యాంకు ఉద్యోగి
చీరాల వన్టౌన్లో కేసు నమోదు.. రూ.5.70 లక్షలు స్వాధీనం
ఏడుగురి అరెస్ట్, పరారీలో మరో మహిళ
చీరాల, మే26 (ఆంధ్రజ్యోతి): లోన్ కావాలంటూ పిలిచి ఓ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్పై అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడి.. తిరిగి ఆయన వద్దే తిరిగి నగదు వసూలు చేసిన ఘరానా వ్యవహారమిది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు తారకరామానగర్కు చెందిన మద్దారపు విజయసారథి బాపట్ల జిల్లా చీరాల స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచిలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. బ్యాంకులో చీరాలకు చెందిన గరిక హేమలత రుణం తీసుకొని తిరిగి చెల్లించింది. తనకు మరోసారి ఇంటి రుణం కావాలని కోరింది. దీంతో ఆమె ఇంటి చిరునామాను బ్యాంకులో సీనియర్ మెసెంజర్గా పనిచేస్తున్న వేటపాలెం మండలం సంపత్నగర్కు చెందిన తెనాలి నెహ్రూను సారథి అడిగారు. కొద్దిసేపు ఆగండి కనుక్కుని చెబుతానని నెహ్రూ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత పక్కా పథకం ప్రకారం పట్టణ పరిధిలోని గంజిపాలెంలో ఓ ఇంటికి ఈనెల 7వ తేదీన సారఽథిని పిలిపించారు. ఆయన అక్కడికి వెళ్లగా బయట ఉన్న ఓ మహిళ లోపల కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్లింది. నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేశా రు. బలవంతంగా అధికారి దుస్తులు తీయించి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దాడి చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. అధికారి ఫోన్పేలో ఉన్న రూ.72వేలు నగ దు వారి ఖాతాకు మళ్లించుకున్నారు. మరో రూ.10లక్షలు ఇవ్వకుంటే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కేసు పెడతామని బెదిరించారు.
సారథి అక్కడి నుంచివెళ్లి ఆ ఇంటికి తనను పంపిన సహోద్యోగి నెహ్రూకు అంతా వివరించారు. అయితే వారితో నేను మాట్లాడి ఫొటోలు, వీడియో డిలీట్ చేయిస్తానని నమ్మబలికి అందరికి కలిపి రూ.6.50లక్షలు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు. దీంతో సారథి ఈనెల 8న అడిగిన మొత్తాన్ని నెహ్రూకు ఇచ్చాడు. ఇదికాకుండా సమస్యను పరిష్కరించినందుకంటూ నెహ్రూ మరో రూ.75వేలు తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఫోన్లో రికార్డు చేసిన వీడియో, ఫొటోలు డిలీట్ చేసి, తిరిగి తన జోలికి రాకుండా ఉండేలా ఒప్పందపత్రం ఇవ్వాలని సారథి అడిగారు. కొంతజాప్యం జరగడంతోపాటు నిందితులు మరో రూ.5లక్షలు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ ఈనెల 21న వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. గరిక హేమలత, చందు, విజయ్, పూజారి జాషువ, తెనాలి నెహ్రూ, నల్లగట్ల ఏకలవ్య, గరిక మహేంద్ర, గరిక ప్రదీ్పలపై కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసి రూ.5.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
ఆపరేషన్ సిందూర్పై ముందుగానే పాక్కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 06:04 AM