భీమిలి బీచ్లో 10 అడుగుల లోతు పునాదులు!
ABN, Publish Date - Mar 20 , 2025 | 03:30 AM
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పునాదులు చూసి అధికారులు అవాక్కవుతున్నారు.
సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అడ్డగోలు ఉల్లంఘన
విశాఖపట్నం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పునాదులు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. సీఆర్జడ్ పరిధిలో అనుమతులు లేకుండా 10 అడుగుల లోతున పునాదులు నిర్మించారు. పైన ప్రహరీ కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పునాదులను పూర్తిగా తొలగించడానికి వారం రోజుల నుంచి భారీ యంత్రాలతో పనులు చేస్తున్నారు.
పునాదుల కోసం కింద బెడ్, దాని కింద బండరాళ్లు కూడా వేశారని తేలింది. దీనిపై నివేదిక ఇవ్వడానికి ఎన్ఐఓ అధికారులు నిర్ణీత ఫీజు చెల్లించాలని సూచించగా జీవీఎంసీ అధికారులు రూ.17 లక్షలు చెల్లించినట్టు తెలిసింది. తొలగింపు పనులు పూర్తి చేసి ఈ నెల 26కల్లా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది.
Updated Date - Mar 20 , 2025 | 03:30 AM