AP High Court judges: శ్రీబగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN, Publish Date - Apr 12 , 2025 | 05:15 AM
చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తులు దర్శనం చేశారు. అమ్మవారికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు స్వీకరించారు
పిట్టలవానిపాలెం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : బాపట్ల మండలం చందోలు గ్రామంలోని శ్రీబగళాముఖి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టున్యాయమూర్తులు జస్టిస్ ఎ.హరిహరనాధశర్మ, జస్టిస్ వై.లక్ష్మణరావు దర్శించి అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు న్యాయమూర్తులకు వేద ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.
Updated Date - Apr 12 , 2025 | 05:15 AM