అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృశ్యాలు..
ABN, Publish Date - Aug 08 , 2024 | 01:45 PM
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీ గడుపుతున్నారు. పెట్టుబడులు, సమీకరణే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, నెట్ జీరో, ప్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. కాగా నిన్న (బుధవారం) ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై చర్చించారు.
డల్లాస్లోని గ్లోబల్ హెడ్క్వార్టర్స్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి శ్రీధర్ బాబు, ఆర్థిక సేవలలో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ స్క్వాబ్ బృందంతో కలిసిన దృశ్యం.
ఆర్థిక సేవలలో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ స్క్వాబ్ చర్చలు జరుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి శ్రీధర్ బాబు..
డల్లాస్లోని గ్లోబల్ మీడియా, టెక్నాలజీ కంపెనీ కాంకాస్ట్ సీనియర్ లీడర్షిప్.. మెల్ పెన్నా (EVP), రిక్ రియోబోలి (CTO), మైక్ క్రిసాఫుల్లి(CIO), టీమ్తో మంత్రి శ్రీధర్ బాబు.
ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం..
డల్లాస్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు..
డల్లాస్లో మహాత్మా గాంధీ మెమొరియల్ ప్లాజాను సందర్శిస్తు్న్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాకు శాలువ కప్పి మెమెంటో అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి.
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం..
Updated Date - Aug 08 , 2024 | 01:46 PM