Parliament: నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:44 AM
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు, కేటాయింపులు, ప్రభుత్వ లక్ష్యాలను సభలో ఆమె వివరిస్తున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందు తన టీమ్తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులతో ఫోటోలు దిగారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయానికి వెళ్లి రాష్ట్రపతి ఆమోదం పొందారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ వివరాలను లోక్సభలో వివరిస్తున్న దృశ్యం.
2024-25 వార్షిక బడ్జెట్ ప్రతులను తీసుకుని తన టీమ్తో పార్లమెంట్కు వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
2024-25 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముతో భేటీ అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ప్రతులకు ఆమోదం పొందిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు స్వీట్ తినిపిస్తున్న ద్రౌపది ముర్ము..
2024-25 వార్షిక బడ్జెట్కు రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం తన టీమ్తో కలిసి ద్రౌపది ముర్ముతో గ్రూప్ ఫోటో దిగిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రాష్ట్రపతి ఆమోదం పొందిన అనంతరం తన టీమ్తో పార్లమెంట్కు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Updated Date - Jul 23 , 2024 | 11:44 AM