Home » Parliament Budget Session
ప్రధానమంత్రి నుంచి ఊహంచని విధంగా పిలుపు వస్తే ఆ ఆహ్వానం అందుకున్న వారికి ముచ్చెమటలు పట్టడమో, ఆనందంతో ఉక్కరిబిక్కిరి కావడమో సహజం. ఆసక్తికరంగా శుక్రవారం మధ్యాహ్నం ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. 8 మంది ఎంపీలకు పీఎం నుంచి పిలుపువచ్చింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ శుక్రవారంనాడు విప్ జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ ఉన్నందున 10వ తేదీన ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరుకావాలంటూ మూడు లైన్ల విప్లో కోరింది.
ఫైర్బ్రాండ్గా పేరున్న సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనూ ఓరకంగా సంచలనమే సృష్టించారు. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్పై విసుర్లు విసిరారు. అయితే తన వీడ్కోలు ప్రసంగంలో సభ్యులందరికీ క్షమాపణలు తెలిపారు.
PM Narendra Modi: అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా నేర్పరి ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకేముంది.. ఈ ప్రభుత్వ కాలంలో చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ.
బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.
PM Narendra Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్ అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తోందని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్లోని ఒక పార్టీ సవాలు చేసిందని గుర్తుచేశారు.
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 10వ తేదీ వరకూ పొడిగించారు. బడ్జెట్ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తున్నట్టు లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా ప్రకటించగా, రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ మంగళవారంనాడు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి.
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. అయితే, దీనికి ఇతమిద్ధమైన కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం (10వ తేదీ) వరకూ సమావేశాలను పొడిగించే విషయంపై చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకే చెందిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పైన పవర్ఫుల్ పంచ్లు విసిరారు. భారతీయులు సోమరులనే అభిప్రాయంతో పండిట్ నెహ్రూ ఉండేవారని అన్నారు.