చిలకలూరిపేట, బోపూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాగళం బహిరంగ సభ విజయవంతమైంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలసి ఘన విజయం సాధించాయి. ఇప్పుడూ అదే రిపీట్ అవుతుందని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్పై విమర్శలకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సైకో జగన్ను తరిమికొట్టేందుకు సిద్ధమా... అని అధినేతలు ప్రశ్నించగా లక్షలాది మంది సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ జనం వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు.