Home » Praja Galam
వైసీపీ(YCP) పాలన అంతా అవినీతిమయం.. ఏపీలో(Andhra Pradesh) మాఫియా రాజ్యం నడుస్తోంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం నాడు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
PM Modi Speech at Prajagalam Public Meeti Live Updates: ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు..
పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో భూ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు.
ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
బాపట్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం చీరాలలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు చీరాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్లో బాబు బస చేస్తారు.
విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.