ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GVL Narasimha rao: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు

ABN, Publish Date - Jan 14 , 2024 | 12:08 PM

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా యూనివర్సిటీలో మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

విశాఖపట్నం: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా యూనివర్సిటీలో మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నంలో నాలుగు రోజులపాటు సంక్రాతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తన ఆహ్వానాన్ని మన్నించి భోగి వేడుకలకు హాజరైన నటుడు సాయికుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంద్ర కలలు, సంస్కృతి ఉట్టిపడేలా భోగి వేడుకలను నిర్వహించామని చెప్పారు. పండగ అంటే గ్యాంబ్లింగ్, క్యాసినోలు నడిపిన సందర్భాలను చూశామని, అలాంటి వాటికి తావులేకుండా సంబరాలు నిర్వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు తెలిపారు.


కాగా తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ఆదివారం ఉదయం రాజధాని ప్రాంతం మందడంలో జరిగే భోగిమంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగున్నర ఏళ్లగా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను భోగి మంటల్లో దహనం చేశారు. కాగా మూడు రోజులపాటు ‘రా కదలిరా’ కార్యక్రమానికి టీడీపీ, జనసేన పార్టీలు పిలుపు నిచ్చాయి.

Updated Date - Jan 14 , 2024 | 12:08 PM

Advertising
Advertising