Home » Sankranthi festival
ఆదాయంలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డ్ నెలకొల్పింది. జనవరి 19న అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చింది.
సంక్రాంతి సెలవులు ముగించుకుని సొంతూర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. పోలీసులు భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నూజివీడు, మైలవరం మార్గం ద్వారా హైదరాబాద్ పంపిస్తున్నారు.
సంక్రాంతి పండుగ ముగిసింది. దీంతో సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు.. నగరాలకు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో సిటీ బస్సులు తగ్గాయి. దాదాపు 500 బస్సులను జిల్లాలకు తరలించారు. దీంతో నగరంలో సిటీబస్సులు తగ్గిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు రావడం, శని, ఆదివారాలు కూడా పాఠశాలలకు సెలవులే కావడంతో చాలామంది ఇంకా ఊర్లల్లోనే ఉండిపోయారు. దీంతో నగరంలో బస్సులను తగ్గించారు.
ఉయ్యూరు మండల పరిధిలో మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట, కాయ్ రాజా కాయ్లు పెద్దఎత్తున జరిగాయి. పెదఓగిరాల సెంటర్ సమీపాన, ఆకునూరు, కాటూరులో భారీగా బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున కోడి పందేలు వేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి బరిలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల వెనుక నడుస్తున్న కోట్ల రూపాయల లావాదేవీలు మరోసారి వెలుగులోకి రావడంతో, రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
గోదారోళ్ల మర్యాదలు అంటే మామూలుగా ఉండవు మరి.. గోదావరి జిల్లాల ఆతిథ్యం గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. కొత్త అల్లుడికి 70 రకాల వంటకాలతో కడియం మండలం జేగురుపాడులో జరిగిన ఈ విందు 'గోదావరి మర్యాద'కు అసలైన నిదర్శనంగా నిలిచింది.
సంక్రాంతి సంబరాల్లో కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. పతంగులు ఎగరేయడం ఒక భాగం. గత కొంత కాలంగా పతంగులు ఎగరేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, జంతువులే కాదు.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా మాంజా ఒక కుటుంబాన్ని బలితీసుకుంది.
ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త ఆశలను పండించాలని, చిరునవ్వులను చిందించాలని కోరుకుంటూ ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటలతో పాత బాధలు దహించిపోతూ, సంక్రాంతి వెలుగులతో కొత్త జీవితం ప్రారంభమై, కనుమ ఆనందాలతో కుటుంబ బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాం.