చంద్రబాబుతోనే రైతన్నలకు మేలు: మంత్రి సవిత
ABN, Publish Date - Dec 25 , 2024 | 06:20 AM
సీఎం చంద్రబాబు పాలనలోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మంత్రి ఎస్.సవిత అన్నారు.
ఏపీఎస్ఏఎం వైస్ చైర్మన్గా మర్రెడ్డి ప్రమాణస్వీకారం
తాడేపల్లి టౌన్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పాలనలోనే రైతన్నలకు మేలు జరుగుతుందని మంత్రి ఎస్.సవిత అన్నారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ‘జగన్ వ్యవసాయాన్ని, రైతులను గాలికి వదిలేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాడు. వ్యవసాయం గిట్టుబాటుకాక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు’ అని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 06:20 AM