ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tirumala: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌

ABN, Publish Date - Apr 12 , 2024 | 06:47 AM

తాను ఐఏఎస్‌ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ జాయింట్‌ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు...

  • జాయింట్‌ సెక్రటరీ హోదాలో దర్శనానికి లేఖ

  • ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరుమల, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): తాను ఐఏఎస్‌ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్‌ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ జాయింట్‌ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు జారీ చేయాలని సిఫార్సు లేఖను సమర్పించాడు. అనుమానించిన టీటీడీ ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. నరసింహమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ అని తేలడంతో తిరుమల టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నరసింహమూర్తి ఐఏఎస్‌ అధికారే కాదని స్పష్టమైంది.

Updated Date - Apr 12 , 2024 | 06:47 AM

Advertising
Advertising