Mallikarjuna Kharge: మోదీ, కేసీఆర్లు దేశాన్ని ,రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
ABN, First Publish Date - 2023-11-17T20:18:09+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ), సీఎం కేసీఆర్ ( CM KCR ) లు దేశాన్ని , రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అన్నారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ), సీఎం కేసీఆర్ ( CM KCR ) లు దేశాన్ని , రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అంతా ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ తోనే పేదల బతుకులు మారుతాయి. ఎన్ని ఉద్యమాలు చేసిన, ఎన్నో ధర్నాలు నడిపినా చివరికి తెలంగాణ ప్రజల ఆశ తీర్చింది సోనియా గాంధీనే. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ఇమేజ్ను దెబ్బ తీయడానికి ఈడీ, ఐటీ దాడులు చేయిస్తూ ప్రజలను ఆందోళన కు గురి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. మోదీ, కేసీఆర్ కలిసి కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించాలని చూస్తున్నారు. కానీ అంతకు అంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. మోదీ, బీజేపీలు అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి వ్యక్తి పైన 5లక్షల అప్పు చేసి పెట్టింది. వీళ్లు చేసిన అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నా... కాళేశ్వరం పేరుతో వేల కోట్లు కొట్టేసి కేసీఆర్ కుటుంబం దాచుకుంటుంది కానీ, నాణ్యమైన ప్రాజెక్టులు కట్టలేక పోతుంది. నిన్న, మొన్న చూస్తున్నాం పలు ప్రాజెక్టులు నాణ్యత లేక కుంగి పోతున్నాయనీ.. ఇలాంటి నాణ్యత లేని ప్రభుత్వం మనకు వద్దు’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
Updated Date - 2023-11-17T20:18:10+05:30 IST