ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: గంగుల.. నిన్నెందుకు గెలిపించాలి?

ABN, First Publish Date - 2023-11-21T12:22:56+05:30

Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గంగులను ఎందుకు గెలిపించాలని ప్రశ్నల వర్షం కురిపించారు.

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌పై (Minister Gangula Kamalakar) బీజేపీ నేత బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గంగులను ఎందుకు గెలిపించాలని ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతిపరులు ఎవరో తేల్చుకుందామని.. ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.


అసలేమన్నారంటే?..

‘‘గంగుల… నిన్నెందుకు గెలిపించాలి. రేషన్ మంత్రివి.. ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చావా? బీసీ మంత్రివి… ఎంత మందికి బీసీ బంధు ఇచ్చినవ్? వడ్ల మంత్రివి… తాలు, కటింగ్ పేరుతో క్వింటాలుకు 10 కిలోలు దోచుకుంటావా? పంట నష్టపోతే పరిహారం ఎందుకివ్వలేదు? 15 ఏళ్లుగా ఎమ్మెల్యేవి.. పేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? సిగ్గు లేకుండా పేదల ఇండ్లను కూల్చివేయిస్తావా? ఎంపీగా కరీంనగర్ అభివ్రుద్ధి కోసం నేను తెచ్చిన నిధులివిగో.. అవినీతిపరులు ఎవరో తేల్చుకుందామా?.. ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా?’’ అంటూ బీజేపీ నేత ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. వరికి మద్దతు ధర రూ.3100 ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-21T12:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising