Home » Gangula Kamalakar
తెలంగాణ రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మారిపోతున్నాయ్..! కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి..!
మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎ్సను వీడి కాంగ్రె్సలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొద్దిరోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి.
కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) అన్నారు. బీఆర్ఎస్కు ఇతర పార్టీలతో పనిలేదని.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తమదని చెప్పారు.
తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ మిగలరని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) తెలిపారు. గురువారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అంటున్నారని.. ముందు వాళ్ల నేతలు బీఆర్ఎస్లోకి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు.
బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) ని కరీంనగర్లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని గంగుల కమలాకర్ తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ రౌండ్కీ సీన్ మారిపోతోంది. రిజల్ట్ అంతుబట్టడం లేదు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నా కూడా కొన్ని చోట్ల ఫలితం రౌండ్ రౌండ్కీ మారిపోతోంది. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హోరా హోరీ నడుస్తోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల ఐదో రౌండ్ పూర్తైంది. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ నడుస్తోంది. ఒక రౌండ్లో బీజేపీ అభ్యర్థి గంగుల కమలాకర్ లీడ్లో ఉంటే.. మరో రౌండ్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్లో కొనసాగుతున్నారు.
Telangana Elections: మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.
కేఏ పాల్ ఎవడు..? సీఎం కేసీఆర్ను చంపుతా అంటుండని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. వాడిది అసలు ఏ ఊరు అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడని మండిపడ్డారు. ఒక్క రూపాయి ఇయ్యను అన్న కిరణ్ కుమార్ తెలంగాణకు ఎందుకు వచ్చిండని గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దొంగలని.. ఢిల్లీ గులాములని పేర్కొన్నారు.