Home » Bandi Sanjay
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిషేధించారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి తిట్టడం వెనక సింపతీ కుట్ర దాగి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్పై రేవంత్ మాట్లాడిన భాష సరైంది కాదన్నారు.
తెలంగాణాలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అటు ఏపీలో కూటిమి హయాంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ హితవు పలికారు.
విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.
విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. యాజమాన్యాలూ..... ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు.. భవిష్యత్తులో ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావా వేసి తనను బెదిరించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, తాను న్యాయపరంగానే ఎదుర్కొంటానని మంత్రి బండి సంజయ్ తెలిపారు.