Home » Bandi Sanjay
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ హితవు పలికారు.
విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.
విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. యాజమాన్యాలూ..... ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు.. భవిష్యత్తులో ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావా వేసి తనను బెదిరించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, తాను న్యాయపరంగానే ఎదుర్కొంటానని మంత్రి బండి సంజయ్ తెలిపారు.
నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి చాపర్లను పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
సంజయన్నా మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ వాటిని తొలగించాలని ఈసీకి లేఖ రాయాలి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం.
కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపైన కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధమా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ సవాల్ విసిరారు.
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.