Share News

MP Bandi Sanjay: గాంధీ వారసుల్లో నిజాయితీ ఉంటే.. హామీలు అమలు చేయాలి..

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:18 PM

విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.

MP Bandi Sanjay: గాంధీ వారసుల్లో నిజాయితీ ఉంటే.. హామీలు అమలు చేయాలి..
Bandi Sanjay

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో యువ వికాసం హామీ యువ వినాశనంగా మారిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నకిలీ హామీలతో తెలంగాణ విద్యార్థులకు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తన యాత్రలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల దుస్థితి గురించి మాట్లాడారని, హైదరాబాద్ యువజన ప్రకటనలో ప్రియాంక గాంధీ రూ.4,000 కోట్ల బకాయిలను క్లియర్ చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు.


ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు. నవంబర్ నుంచి మూసివేయడానికి కళాశాలల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఒకవైపు తల్లిదండ్రులు అప్పుల్లో మునిగిపోతున్నారని, మరోవైపు కాలేజీలో సర్టిఫికెట్లు నిలిపివేయడంతో విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆశలు కోల్పోతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.


తెలంగాణలో ఎన్నికలకు ముందు విద్యార్థుల కోసం సోదరుడు-సోదరి నినాదాలు చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల కోసం తెలంగాణ విద్యార్థులను ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి అవసరం తీరడంతో విద్యార్థులను వదిలిపెట్టారని విమర్శించారు. గాంధీ వారసులుగా నిజాయితీ మిగిలి ఉంటే, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయడం ద్వారా వారు దానిని నిరూపించుకోవాలని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 03:41 PM