Home » Fee Reimbursement
ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రియింబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
పంట కొనుగోలు చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .
విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.
ఫీజు బకాయిలపై తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాటకి సిద్ధమయ్యారు. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ చేపట్టడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
నగరంలో ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు.
గత బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ రీయింబర్స్మెంట్ ఫీజులు చెల్లించకుండా ఆ భారాన్ని తమ మీద మోపిందని విమర్శించారు.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ సోమవారం నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి.