Home » Fee Reimbursement
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు బండి సంజయ్ .
విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.
ఫీజు బకాయిలపై తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాటకి సిద్ధమయ్యారు. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ చేపట్టడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
నగరంలో ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు.
గత బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ రీయింబర్స్మెంట్ ఫీజులు చెల్లించకుండా ఆ భారాన్ని తమ మీద మోపిందని విమర్శించారు.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ సోమవారం నుంచి ఉన్నత విద్యాసంస్థలు బంద్ చేపట్టాయి.
గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సర్కారు ముందు ప్రైవేటు కాలేజీల యాజమా న్యాలు కొత్త ప్రతిపాదన ఉంచాయి.
ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏటేటా పెరిగిపోతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలే ఫీజు చెల్లింపునకు పరిష్కార మార్గాన్ని సర్కారుకు సూచించాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్మెంట్ బిల్లులను క్లియర్ చేసింది.
గతంలో ప్రకటించిన విధంగా ఈనెల 30లోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.