Home » Rahul Gandhi
పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం సుల్తాన్పూర్లోని ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త భవనం కేటాయించింది. సునేహ్రి బాగ్ రోడ్లోన బంగ్లా నెంబర్-5ను ఆయనకు హౌస్ కమిటీ ఆఫర్ చేసింది.
అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. జులై 26వ తేదీ కార్గిల్ దివాస్. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సైన్యంలో సంస్కరణల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు.
సోనియా, రాహుల్, ఖర్గేల నాయకత్వంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
రైతుల పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. పలు సాగు అంశాలపై ఈ రెండు రాష్ట్రాల రైతాంగం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ పొలిమేరల్లోని శంభు
పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని..
మరికొన్ని గంటల్లో కేంద్రప్రభుత్వం 2024-25కి సంబంధించి పూర్తిస్థాయి భారతదేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దేశం మొత్తం బడ్జెట్ వైపు చూస్తోంది. సరిగ్గా 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు.
పార్లమెంట్ సాక్షిగా విపక్షాలు అప్రజాస్వామికంగా తన గొంతు నొక్కేయాలని ప్రయత్నించాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి మోదీ ధన్యవాదాలు చెబుతుండగా..