Home » Rahul Gandhi
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) పథకం అతి పెద్ద దోపిడీగా అభివర్ణించడాన్ని షా తప్పుబట్టారు.
ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని, విద్వేషాలను ఓడించాలని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పిలుపునిచ్చారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరవాలని కోరారు.
రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం నాడు మాట్లాడారు. అర్థం, పర్థం లేని వ్యాఖ్యలపై మాట్లాడాలని అనుకోవడం లేదు. తమ గురించి కంగన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 150 సీట్లకు మించి రావని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. తొలి విడత పోలింగ్ ప్రచారానికి బుధవారంనాడు తెరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఇద్దరు నేతలు మీడియా సంయుక్త సమావేశంలో పాల్గొ్న్నారు.
లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం అంటే.. ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఆ క్రమంలో ఈ రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తొలుత అసోంలోని నల్బరీలో.. అనంతరం త్రిపుర రాజధాని అగర్తలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి ఛాంపియన్ అని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని ఆరోపించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రియల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందుకు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో రెడీ అయ్యాయి.
ఇండియా కూటమికి 272 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
లోక్ సభ ఎన్నికలు -2024 ( Lok Sabha Elections - 2024 ) కు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.