Home » Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్కు సంబంధాలు ఉన్నాయని, ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని అన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మన రైతులను వంచించారని, దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అది ఒక ఫేక్ మీటింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
లోక్సభలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఏంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్సభలో 'సబ్స్టాంటివ్ మోషన్' దాఖలు చేశారు.
ప్రధాని మోదీ అమెరికాకు పూర్తి లొంగిపోయారని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత-అమెరికా వర్తక ఒప్పందం ద్వారా 140 కోట్ల భారతీయ ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఎప్స్టీన్ను తాను కలిసిన మాట నిజమేనని, అయితే ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధుల బృందంలో భాగంగానే తాను ఆయనను కలిశానని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
లోక్సభలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి, సభను తప్పుదారి పట్టించిన విపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్పై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో ట్రేడ్ డీల్తో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు.
డాలర్ ఆధిపత్యంపై కొన్ని దేశాలు పోరాడుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా ఆధిపత్యానికి పలు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. ఇంధన, ఆర్థిక రంగాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు..