ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కా పథకంతో అత్త ఇంటికి స్నేహితులతో కలిసి వెళ్లిన వ్యక్తి.. చివరికి సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా..

ABN, First Publish Date - 2023-01-10T21:08:46+05:30

ప్రస్తుతం చాలా మంది యువకులు భవిష్యత్‌పై దృష్టి పెట్టకుండా.. వివిధ నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు యువకులు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం చాలా మంది యువకులు భవిష్యత్‌పై దృష్టి పెట్టకుండా.. వివిధ నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు యువకులు.. ఈజీ మనీ కోసం ఎంతటి దారుణాలకు పాల్పడటానికైనా వెనకాడరు. ఉత్తరప్రదేశ్‍‌లో ఓ వ్యక్తి ఇలాంటి పని చేసి, చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. తన స్నేహితులతో కలిసి అత్త ఇంటికి వెళ్లిన అతను చివరకు ఏం చేశాడంటే..

Viral Video: ఆటోను చూడగానే అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. తీరా ఆటో లోపల చూస్తే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫతేపూర్ ప్రాంతానికి చెందిన యువకుడి అత్తమామలు బండాలో ఉంటున్నారు. ఇటీవల అతను తన స్నేహితులతో కలిసి అత్త ఇంట్లో చోరీ (theft) చేయాలని ప్లాన్ వేశాడు. వారు లేని సమయం చూసుకుని ఓ రోజు రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించారు. ఇంట్లో సుమారు రూ.3లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను (Gold and silver jewellery) ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చివరకు సీసీ కెమెరాలు (CC cameras) పరిశీలించి, నిందితులను గుర్తించారు.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చివరకు నేరం అంగీకరించారు. వీరు గతంలోనూ పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు బయటపడింది. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను కాన్పూర్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఓ బంగారు దుకాణదారుడు కూడా వీరితో కలిసి చోరీల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన ఆభరణాలు, రెండు అక్రమ పిస్టల్స్, నాలుగు కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. బండా పరిధిలో ఇటీవల చోరీలు పెరిగిపోయాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

Updated Date - 2023-01-10T21:09:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising