హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

ABN , First Publish Date - 2023-01-08T17:15:08+05:30 IST

వారిద్దరికీ కొత్తగా వివాహమైంది. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం గ్రాండ్‌గా జరిగింది. అయితే తన హనీమూన్ ట్రిప్ అంతకంటే గ్రాండ్‌గా ఉండాలని యువకుడు ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే అంతా జరిగింది. అయితే..

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికీ కొత్తగా వివాహమైంది. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం గ్రాండ్‌గా జరిగింది. అయితే తన హనీమూన్ ట్రిప్ అంతకంటే గ్రాండ్‌గా ఉండాలని యువకుడు ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే అంతా జరిగింది. అయితే హనీమూన్‌లో ఉండగా అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. భార్య ఏం చేస్తోందో అని వెతికిన అతడు చివరకు షాక్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. భార్య విడాకులు ఇస్తోందన్న కోపంతో కుటుంబంలోని అందరినీ చంపి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీఘర్ సివిల్ లైన్ పరిధి గురుద్వారాకు చెందిన సత్యం అనే యువకుడికి.. ఆగ్రా కాంట్‌కు చెందిన దీపాసిని అనే యువతితో నవంబర్‌లో (marriage) వివాహమైంది. బంధవులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత తన హనీమూన్ ట్రిప్ (Honeymoon trip) ఇంకా గ్రాండ్‌గా ఉండాలని.. సత్యం నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 8న తన భార్యతో కలిసి ఉత్తరాఖండ్ (Uttarakhand) ట్రిప్‌కు ప్లాన్ చేశాడు. 9వ తేదీన రిషికేశ్ చేరుకుని, అక్కడే ఓ మంచి హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక.. వేడి వేడి టీ (tea) తీసుకురమ్మని భార్యకు చెప్పాడు. అయితే ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ టీ తాగిన కొద్ది సేపటికి అతను అపస్మారక స్థితిలోకి (state of unconsciousness) వెళ్లిపోయాడు.

బ్యాగులో లక్ష రూపాయల నోట్ల కట్టలు.. కానీ నడిరోడ్డుపై బ్లేడుతో కోసుకుని ఓ యువకుడు దారుణం.. చివరకు..

bride-and-groom.jpg

అర్ధరాత్రి నిద్ర లేచిన అతడికి.. ఏం జరిగిందో కొద్ది సేపు ఏమీ అర్థం కాలేదు. తర్వాత తన భార్యను పిలిచినా స్పందన రాలేదు. ఏం చేస్తుందో చూడాలని గది మొత్తం వెతికినా.. కానీ ఆమె కనిపించలేదు. దీనికితోడు ఎదురుగా ఉన్న రూ.30వేల నగదు, రూ.3.4లక్షల విలువైన నగలు, వివిధ రకాల సామన్లు కనిపించలేదు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హోటల్ యాజమాన్యంతో మాట్లాడి, సీసీ కెమెరా ఫుటేజీని (CCTV footage) పరిశీంచగా.. రాత్రి 7గంటల సమయంలోనే ఆమె వెళ్లిపోయినట్లు కనిపించింది. మోసపోయానని తెలుసుకున్న అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణంలో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Viral Video: నూడుల్స్ తిందామని స్పూన్‌తో పైకి ఎత్తగానే.. ఒక్కసారిగా ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

దీపాసికి అప్పటికే అన్షు యాదవ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం (love affair) నడిచిందని తెలిసింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. ఆ విషయం దాచి పెట్టి సత్యంతో వివాహం చేసినట్లు వెల్లడైంది. ఈమె గతంలోనూ చాలా సార్లు ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు విచారణలో తేలింది. ఇలావుండగా, ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇదే సమయంలో తమ కూతురిపై దాడి చేశాడని, అదనపు కట్నం తేవాలని వేధించారని ఆరోపిస్తూ యువతి కుటుంబ సభ్యులు.. సత్యంపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..

Updated Date - 2023-01-08T17:15:20+05:30 IST