విజయనగరం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు పురస్కరించుకుని పోలిపల్లిలో బుధవారం నిర్వహించిన సభ విజయవంతమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. లోకేష్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రసంగంలోని ప్రతి అంశానికీ ప్రేక్షకులు ఉత్తేజితులై కేరింతలు కొట్టారు.