Home » Nara Chandra Babu Naidu
జంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..
ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..
సినిమాను తలిపించేలా గులక రాయి దాడి డ్రామా జరిగిందని ఎంపీ, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఉండి అసెంబ్లీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో దైవం దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...నిన్ననే నామినేషన్ వేసి..ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని విరుచుకుపడ్డారు.
ఈ సైకో(జగన్)ను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజాగళం’లో భాగంగా పాతపట్నం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి? అని ప్రశ్నించారు.తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా అని నిలదీశారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..
విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రమంతా మాదకద్రవ్యాల మయమైపోయిందని తెలుగుదేశం జాతీ య అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు విజయనగరంలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుల అక్రమాలు పెరిగిపోతున్నాయని వీటిని అణిచేద్దామని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మాఫియాను ఏపీ నుంచి తరిమేద్దామని హెచ్చరించారు.