Home » Vizianagaram
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.
తెలుగు టీవీ జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించిందని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు. దమ్మున్న, మనసున్న ఛానల్గా తెలుగు ప్రేక్షకుల మదిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిలిచిందని కొనియాడారు.
పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని... చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు కష్టాలు లేని ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు.
సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డల కోసం స్త్రీశక్తి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.
2026వ సంవత్సరం జూన్లో భోగాపురం ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ రాకపోకల కోసం ఏడు ప్రధాన రహదారులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన తరువాత నిపుణుల వైద్యం అందేలో గా ‘ప్రథమ చికిత్స’ చాలా కీలకం. అలా సరైన సమయం లో ప్రథమ చికిత్స అందక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఆరిఫ్ దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాదులకు ఆయుధాలను సమకూర్చుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
సీపీ రాధాకృష్ణన్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.