Home » Vizianagaram
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వివాదంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులను పరిశీలించి ఆ స్థలాన్ని తిరిగి అశోక్ గజపతిరాజుకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదని.. వెనక ఉండి నడిపించే జిల్లాలని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో చేతబడి అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. మృతదేహాన్ని శ్మశానంలో దహనం చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు, కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గింజేరులో కూటమి నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.
విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి.
చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం జరిగిన ఏడో విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తొలుత వివరించారు.
జిల్లాలో చాలా చెరువులు మారిపోయాయి. ఎంతలా అంటే అక్కడ చెరువొకటి ఉండేదట అనుకునేలా మార్చేశారు. నిర్మాణాలు కట్టేశారు.. పొలాలుగా చేసేశారు.. రియల్టర్లు చెరువులను ఆనుకుని కొనుగోలు చేసిన పొలాల్లో ఇష్టారాజ్యంగా లేఅవుట్లను తీర్చిదిద్దేశారు.