Home » Vizianagaram
Tribal:సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఆరుగాలం కష్టపడి సేకరించిన గిరిజన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను జీసీసీ (గిరిజన సహకార సంఘం) కల్పించకపోగా, మరోపక్క ఉన్న అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
the Shambara fair:శంబర పోలమాంబ జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
Lord Venkateswara: పట్టణంలోని కంచర వీధిలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శనివారం పూలంగి సేవను నిర్వహించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్పై వెళ్తున్నారు.
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా లాగి విసిరేసాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ(శనివారం) షెడ్యూల్ విడుదల అయింది ఈరోజు నుంచి విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు కానుంది. ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
జగన్ మీడియా సమావేశంలో గందరగోళం.. దీంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రెస్మీట్లో మీడియాతో మాట్లాడాలా.. వద్దా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పోలీసులపై మండిపడ్డారు. తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్.. లేని ప్రతిపక్ష నేత హోదాను ఉన్నట్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్ తీరుపై స్థానికులు మండిపడ్డారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. డయేరియా వల్ల 10 మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గుర్ల ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి తాను వ్యక్తిగతంగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.