Home » Vizianagaram
చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం జరిగిన ఏడో విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తొలుత వివరించారు.
జిల్లాలో చాలా చెరువులు మారిపోయాయి. ఎంతలా అంటే అక్కడ చెరువొకటి ఉండేదట అనుకునేలా మార్చేశారు. నిర్మాణాలు కట్టేశారు.. పొలాలుగా చేసేశారు.. రియల్టర్లు చెరువులను ఆనుకుని కొనుగోలు చేసిన పొలాల్లో ఇష్టారాజ్యంగా లేఅవుట్లను తీర్చిదిద్దేశారు.
గజపతినగ రం దావాలపేట పరిధిలోగల మహంకాళీ అమ్మవారి గుడి సమీ పంలో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు.
ఉపాధి హామీ పనుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని పంచాయతీరాజ్, ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ ఎం.శివప్రసాద్ హెచ్చరించారు. బుధవారం ఉల్లిభద్ర, నాగూరు పంచాయతీల్లో ఉపాధి పనులను పరిశీలించారు.
ఎస్.కోటలో పేదలకు చెందిన 1166 ఎకరాలను ప్రభుత్వం జెఎస్డబ్ల్యూ(జిందాల్)కు ఇచ్చింది. ఆ భూముల్లో అల్యూమినియం పరిశ్రమ పెడతామని యాజమాన్యం చెప్పింది. 2006లో భూములు అప్పగించగా నేటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.
ఆ ముగ్గురు మహిళలు అంతవరకు దొండ పంట సాగులో గడ్డితీత పనులు చేశారు. చిరు జల్లులు పడుతుండడంతో పని ఆపి ఇంటికి బయలుదేరారు. అంతలో చెట్టు కింద ఉంచిన ఖాళీ క్యారేజీలు గుర్తుకు వచ్చి తీసుకురావడానికి వెళ్లారు.
కొత్తవలస ఉమా జూట్ మిల్లును యాజమాన్యం మూడు నెలలు పాటు షట్డౌన్ చేస్తూ ప్రకటించింది. మిల్లులో ఉత్పత్తికి ముడిసరుగా ఉన్న జనపనారకు తీవ్ర కొరత ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగానే షట్డౌన్ అమలు చేస్తున్నట్టు తెలిపింది.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
జనగణనకు సహకరించలేదని కొటియాలో ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడంపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహించారు. కొటియా గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది.