ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కారులోనే సజీవ దహనమైన తెలుగు విద్యార్థి..!

ABN, First Publish Date - 2023-06-04T09:23:21+05:30

అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల, సత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు గుర్రపు శైలేష్‌ (23) బీటెక్‌ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం గతేడాది న్యూజెర్సీకి వెళ్లాడు. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్‌లో మాస్టర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం శైలేష్ ప్రయాణిస్తున్న కారులోని పెట్రోల్ ట్యాంకు న్యూజెర్సీలోని స్కెలిటన్ ఆర్డి ఎడిషన్ ప్రాంతంలోకి రాగానే ఒక్కసారిగా పేలింది.

దీంతో కారు మొత్తానికి ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకోవడంతో శైలేష్ కారులోనే సజీవ దహనమయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు అతడి స్నేహితులు ఫోన్ ద్వారా తెలియజేశారు. శైలేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అతని స్వగ్రామం బడాభీమ్‌గల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. శైలేష్‌ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని బంధువులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విన్నవించారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-04T09:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising