Home » Nizamabad
కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.
Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.
Modi Public Meeting In Jagtial హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు..
లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కాబోతుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కమిటీలకే పరిమితమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
Telangana: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. నిజామాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది.
Telangana: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్ అని ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతి చెందారు. హాస్టల్ వార్డెన్ లేకపోవడంతో విద్యార్థులంతా కంట్రోల్ తప్పారు. వెంకటి అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. అంతే.. వెంకటిని ఐదుగురు విద్యార్థులు కలిసి హతమార్చారు.
నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.