ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: కొడాలి నాని పిచ్చిపట్టి మాట్లాడుతున్నాడు: టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2023-04-14T15:44:15+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu)పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని (Gudivada MLA Kodali Nani) పై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. నాని పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని అన్నారు. కుటుంబసభ్యుల మధ్య చిచ్చుపెట్టే రకం నాని అంటూ వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి భూమి మీద ఉండే అర్హత లేదని టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలినాని కళ్లు బైర్లు కమ్మి తన రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధమై పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. గుడివాడకు ఎన్నో మంచిపనులు చేశారని.. ఆయన చేసిన ఒక్కే ఒక్క చెడ్డ పని కొడాలినానికి టిక్కెట్ ఇవ్వటమే అని అన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గుడివాడ రోడ్ షో కమ్మ వారి షో అని నీచ రాజకీయం చేస్తున్నారన్నారు. రోడ్డు షో లో అని వర్గాల నాయకులు పాల్గొన్నారన్నారు. కొడాలి నానికి బి- ఫామ్ ఇచ్చింది చంద్రబాబు (TDP Chief) కాదా అని ప్రశ్నించారు. సీట్ కోసం చంద్రబాబు కాళ్ళ మీద పడిన సంగతి గుర్తు లేదా అని నిలదీశారు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలినాని అంటూ వ్యాఖ్యలు చేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకం దంపతుల విగ్రహాలు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు. బందరు పోర్టు నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలీకుండా కొడాలినాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళల్ని తూలనాడే కొడాలినాని లాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు కాళ్లపై పడి బీఫామ్ తీసుకున్న విషయం కొడాలినాని మరిచాడా అంటూ యెద్దేవా చేశారు.

గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అసత్యాలతో గుడివాడ ప్రజల్ని 20 ఏళ్లుగా కొడాలినాని మోసగిస్తూ వస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుడివాడలో నిర్మించిన 800కు పైగా టిడ్కో ఇళ్లు పేదలకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Updated Date - 2023-04-14T15:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising