Home » Devineni Umamaheswara Rao
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) తెలిపారు. వైఎస్ జగన్ రెడ్డి పులివెందులలో పెడబొబ్బలు పెడుతున్నాడని విమర్శించారు.
కోట్ల రూపాయల ఫర్నిచర్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది. విపక్ష నేతలు దీనిపై విరుచుకు పడుతున్నారు. ఇంట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను వేధించిన కర్మఫలం మాజీ సీఎం జగన్ రెడ్డిని వెంటాడుతోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలను ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ జహవర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎస్గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. సీఎస్, అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్షాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని మండిపడ్డారు.
సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై అధికారులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. వైసీపీకి వంతపాడటమే జవహార్ రెడ్డి పనిగా మారిందని విమర్శించారు. ఇదే విషయమైన గురువారం నాడు మీడియాతో మాట్లాడారు దేవినేని ఉమ. 13వ తేదీన మధ్యాహ్నం స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ..
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.