Home » Devineni Umamaheswara Rao
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు-2024కు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు సమర్పించగా మరికొందరు సన్నద్ధమవుతున్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ రేపు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కార్యాలయానికి వసంత కృష్ట ప్రసాద్ వెళ్లారు.
వైసీపీ సర్కార్ ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Pawan Kalyan) పై రాళ్లదాడి పిరికిపంద చర్య అని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్కు గురైంది. దాంతో సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్లో హెరిటెజ్కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ (CM Jagan), సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేతలు వర్లరామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు చేశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య (Varlaramaiah) మాట్లాడుతూ... జగన్ ఇష్టం వచ్చినట్లు నోటకి వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు జగన్ అతీతుడా అని అడిగామన్నారు. జగన్ నటుడుగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: నందిగామలో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆంధ్ర హస్పటల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్భలంతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య వీరోచితంగా పోరాడుతున్నారన్నారు.