ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anam Ramanarayana: వైసీపీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోంది

ABN, First Publish Date - 2023-09-15T15:48:39+05:30

జిల్లాలోని మర్రిపాడులో చంద్రబాబుపై అక్రమ కేసు, అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టింది.

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడులో చంద్రబాబుపై (TDP Chief Chandrababu) అక్రమ కేసు, అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టింది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీధర్ ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి (MLA Anam Ramnarayanareddy) మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును దోషిని చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి (YCP Goverment) రెండేళ్లు ఆలోచన చేసిందన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండానే చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఐటీ ఉద్యోగుల నిరసనను చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేకపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఉద్యోగులను(IT Employees) నిరసన చేయకుండా పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగులను కేటీఆర్ (Telangana Minister KTR) పోలీసులతో బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. వైసీపీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-09-15T15:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising