Home » Anam Ramanarayana Reddy
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పురాతనమైన, పవిత్రమైన ఆలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలకు భద్రత కొరవడిందని.. విధ్వంసాలు సృష్టించారని ధ్వజమెత్తారు.
కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ జరిగింది. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. మహానాడు నిర్వహణకు పలుచోట్ల స్థలాలను చూశామని పేర్కొన్నారు.
ఏసీ సుబ్బారెడ్డి వారసులుగా తాము ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయాల విశిష్ఠతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణం అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు.
సీఎం చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం తపిస్తుంటారని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు. ఆయన ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని, ఇంకా చాలాకాలం సీఎంగా ప్రజలకు తోడుగా ఉండాలని మహాయజ్ఞం నిర్వహించామన్నారు మంత్రి.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రాజెక్ట్లు ప్రకటించి.. వైసీపీ రాజకీయ లాభం చూసుకుందని మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి మావిగన్ పేరుతో, ప్రజలనీ తప్పు దోవ పట్టిస్తున్నారని.. ఆయనకు మతిస్థితం లేదని ఎద్దేవా చేశారు.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులను మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా 4వ స్తంభం అన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్కు లేదు... రాదు అని విమర్శించారు.