Home » Anam Ramanarayana Reddy
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.
బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారయణలు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు.
శ్రీశైలం లాంటి దివ్య క్షేత్రాన్ని మరింత తీర్చిదిద్దాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో ఒకే ప్రాంగణంలో స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉండటం దేశంలోనే ఎక్కడా లేని విశేషమని అభివర్ణించారు.
పూజలు లేని ఆలయాలను దూపదీప నైవేద్యం పథకం కింద పరిరక్షిస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. భగవన్ నామస్మరణ కోసం ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖను ప్రక్షాళన చేస్తున్నామని... 476 ఆలయాలకు పాలకవర్గం ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కూటమి ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకి ట్రస్టు బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు.
సనాతన ధర్మం పాటిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పూర్తి శాస్త్రోక్తంగా దేవాలయాల్లో భగవంతునికి పూజా కైంకర్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదే జరిగితే, రాయలసీమ ప్రాంతానికి రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నారు.