ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padayatra begin: లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2023-01-27T11:46:14+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర (TDP Leader Nara Lokesh Yuvagalam Padayatra start) ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం కుప్పంలో 'యువగళం' పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పంకు తరలివచ్చారు. దీంతో పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారిపోయింది. జై యువగళం అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి లోకేష్ నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 1:05 గంటలకు కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 1:25 గంటలకు కొత్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 'యువగళం' బహిరంగ సభకు లోకేష్ హాజరుకానున్నారు.

Updated Date - 2023-01-27T17:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising