ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lakshmana Reddy: పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి..?

ABN, First Publish Date - 2023-12-10T19:06:17+05:30

పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి ( JAGAN REDDY ) అని జన చైతన్య వేదిక నేత లక్ష్మణరెడ్డి ( Lakshmana Reddy ) అన్నారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సదస్సు నిర్వహించారు.

తిరుపతి: పాలన అంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టడమేనా జగన్‌రెడ్డి ( JAGAN REDDY ) అని జన చైతన్య వేదిక నేత లక్ష్మణరెడ్డి ( Lakshmana Reddy ) అన్నారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికే జగన్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా ఉంది. నెలలో రెండు, మూడు రోజులు మాత్రమే పని ఉండే వలంటీర్లకు ఒక్కో గ్రామంలో లక్ష రూపాయలు, సచివాలయ వ్యవస్థకు 3.5 లక్షలు మొత్తం 4.5 లక్షలు, ఏడాదికి 50 లక్షలు ఒక్కో గ్రామంలో ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఏడాదిలో 50 లక్షల రూపాయల అభివృద్ధి గ్రామంలో జరగడం లేదన్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజాధనం, అధికారం దుర్వినియోగం జరుగుతోందని చెప్పారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టే విధంగా నిరంతరం జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారని లక్ష్మణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-12-10T23:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising