ఫిబ్రవరి 15 కోసం ఎదురుచూస్తున్నా: సింగర్ శ్రీరామ్
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:50 PM
హైదరాబాద్: ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ ఫిబ్రవరి 15 హైదరాబాద్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. నగర వాసులందరికీ ఇది గుడ్ న్యూస్. మూడేళ్ల తరువాత మళ్లీ హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అన్నారు.
హైదరాబాద్: ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ ఫిబ్రవరి 15 హైదరాబాద్లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. నగర వాసులందరికీ ఇది గుడ్ న్యూస్. ఈ సందర్బంగా శ్రీరామ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ఈ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఫిబ్రవరి 15 కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. మూడేళ్ల తరువాత మళ్లీ హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత పదేళ్ల నుంచి తెలుగు ఆడియెన్స్ తనపై ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారని, తనకు తెలుగులోనే ఎక్కువ మంది అభిమానులున్నారని తెలిపారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ చేశానని.. మళ్లీ ఇప్పుడు చేయబోతోన్నామని, ఈ కాన్సర్ట్లో తన పాటలతో పాటుగా 80, 90వ దశకంలో వచ్చిన మెలోడీ పాటల్ని కూడా పాడతానని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ ప్రజలు ఎగిరిగంతేసే వార్త..
ఈ వార్తలు కూడా చదవండి..
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
అధికారుల సమావేశం.. రమ్మీ ఆడుతున్న డీఆర్వో
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 21 , 2025 | 12:50 PM