అధికారుల సమావేశం.. రమ్మీ ఆడుతున్న డీఆర్వో

ABN, Publish Date - Jan 21 , 2025 | 11:02 AM

అనంతపురం: ఉన్నతాధికారుల సమావేశంలో అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) బిజీ బిజీగా ఆన్ లైన్ రమ్మీ ఆడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు.

అనంతపురం: ఉన్నతాధికారుల సమావేశంలో అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) బిజీ బిజీగా ఆన్ లైన్ రమ్మీ ఆడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్లు, జిల్లా పోలీసులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఓ వైపు సమావేశం జరుగుతుండగానే మరోవైపు తనకేమి పట్టనట్లు రమ్మీ ఆడుతూ డీఆర్‌వో మలోల బిజీ బిజీగా గడిపారు. ఇక స్మార్ట్ ఫోన్‌లో రమ్మీ ఆడుతూ తన ప్రపంచంలో మునిగిపోయారు.

ఈ వార్త కూడా చదవండి..

ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు..


కాగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాలు తరలివచ్చాయి. పక్కనే ఉన్నతాధికారులు ఉన్నా ఆన్ లైన్ పేకాట ఆడుతూ కాలక్షేపం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయంలోనూ డీఆర్‌వో మలోల పేకాట ఆడటమే పనిగా పెట్టుకున్నారంటూ కలెక్టరేట్ ఉద్యోగులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు

కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి

సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 21 , 2025 | 12:29 PM