ప్లీజ్ కాపాడండి.. యువతి ఆర్తనాదాలు..
ABN, Publish Date - Jul 26 , 2025 | 08:00 PM
షాద్నగర్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. షాద్నగర్కు చెందిన మచ్చేందర్ తన కుమార్తె మైత్రిని కళాశాల వద్ద దింపేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్నారు.
రంగారెడ్డి: షాద్నగర్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. షాద్నగర్కు చెందిన మచ్చేందర్ తన కుమార్తె మైత్రిని కళాశాల వద్ద దింపేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్నారు. అయితే షాద్నగర్ చౌరస్తా వద్దకు రాగానే వారి వాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముచ్చేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సదరు యువతి లారీ టైర్ల మధ్య ఇరుక్కుంది. ఈ సమయంలో ఆమె చేసిన ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి. కాపాడాలంటూ మైత్రి వేసిన కేకలు కన్నీళ్లు తెప్పించాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Updated Date - Jul 26 , 2025 | 08:00 PM