రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:30 PM
రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో రాబోయేది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్
మందమర్రిటౌన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో రాబోయేది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ నూత న అధ్యక్షుడిగా రాంచందర్రావు నియమితులైన తర్వాత ప్రజల సమ స్యలపై పోరాట కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నా రు. రాష్ట్ర అధ్యక్షుడు పలు నియోజకవర్గాల పర్యటనకు సిద్దమ య్యా రన్నారు. నేడు మందమర్రిలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పర్య టించనున్నారని తెలిపారు. ఆయనకు సింగరేణి, ప్రజల సమస్యల ను విన్నవిస్తామన్నారు. స్వాగతం యాత్రను కూడా ఏర్పాటు చేస్తు న్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు తరలి రావాన్నారు. ఈ సమా వేశంలో పార్టీ జిల్లా, పట్టణ నాయకులు అందుగుల శ్రీనివాస్, దీక్షి తులు, రొడ్డ మోహన్, సంజీవరావు, మల్యాల రాజమల్లు, వేణు, జనా ర్ధన్, ధన్సింగ్, రవి, శరత్, శేఖర్ పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 11:30 PM